కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం..
-రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ
-తడిసిన ధాన్యంతో ఆందోళన చెందవద్దు. కలెక్టర్
నమస్తే ఇందూర్. బోధన్ ప్రతినిధి. కే మధుకర్.. 30 అక్టోబర్
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహిం చడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్ మండల వ్యవసా య అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.బోధన్ నియోజకవర్గంలోని నవీపేట మండలం అభంగపట్నం, తడ్ గాం,రెంజల్ మండలం వీరన్నగుట్ట,ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామా లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శిం సందర్భంగా వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నిర్వహణలో ట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లుకు తరలించడాన్ని కలెక్టర్ తప్పు
పట్టారు. ట్రక్ షీట్లు సకా లంలో తెప్పించుకుని ,వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయించడంలోనూ జాప్యం చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ,పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధు ల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారి ఖాతాలలో బిల్లుల చెల్లింపులు జరిగే లా కృషి చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కాగా, తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించా రు. మాయిశ్చర్ మీటర్ ద్వారా
కలెక్టర్ స్వయంగా తేమ శాతం పరిశీలించారు.17శాతానికి లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి, మిల్లులకు తరలించాలని సూచించారు. అకాల వర్షాల వలన తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల లో విక్రయించాలని అన్నారు.తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రైతులతో వెల్లడించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుం డా టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని, ధాన్యా న్ని ఎత్తైన ఖాళీఆగ్రహం.రెంజల్ ప్రదేశాలలో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.తహసిల్దార్లు,వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్తాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ,నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన బిల్లు మొత్తాలతో పాటు, బోనస్ ను కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లు,శ్రావణ్ కుమార్, దత్తాద్రి,వెంకటరమణ, యుడి ఆరి.మహేష్ కుమార్, వ్యవసాయ శాఖ అధికా రులు సిద్దిరామేశ్వర్,ఎడపల్లి సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి,సహకార సంఘాల సీఈవో లు రాజారాం,సుభాష్,గంగారెడ్డి, ఎపిఎం. రాజేందర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు,హరిబాబు,కొనుగోలు కేంద్రాల అధికారులు,తదితరులు ఉన్నారు.



