ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభ
ఝరాసంగం మండలం నమస్తే ఇందూర్ ఏప్రిల్ 02
ఝరాసంగం మండలం బొప్పాన్ పల్లి గ్రామంలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘ కార్యక్రమంలో భాగంగా, బోపన్పల్లి గ్రామంలో గ్రామసభను అత్యంత
ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికా బద్ధమైన అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని, గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ సభ సాగింది.స్థానిక సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరగాలని సర్పంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.