NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 4:05 pm Posted by : Rayala Polaiah

కారం విద్య శరణ్యకు సీటు కేటాయించిన అధికారులు

నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 20

 

స్పందించిన ఐ టి డి ఎ  పి ఓ . మరియు ఆర్ సి ఓ …

 

కారం విద్యా శరణ్యకు సీటు కేటాయించిన అధికారులు..

ఆదివాసి సంఘ నాయకుల దృష్టికి రాగానే సమస్యకు పరిష్కారం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన దివ్యాంగ విద్యార్థిని “కారం విద్యా శరణ్య” పదో తరగతిలో 505 మార్కులు సాధించి వైరా గిరిజన గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం సీటు సాధించింది. కానీ, కాలేజీ హాస్టల్‌లో దివ్యాంగులకు తగిన మౌలిక సదుపాయాలు లేవనే సాకుతో కాలేజీ ప్రిన్సిపాల్ మాధవి లత అడ్మిషన్ నిరాకరించడంతో కుటుంబ సభ్యులు విద్యార్థిని తీవ్ర ఆవేదన గురై నేపథ్యంలో, ఆదివాసి సంఘ నాయకుల వెంటనే స్పందించి పి ఓ.తో మరియు ఆర్ సి ఓ మాట్లాడిన పొలిటికల్ జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర. జి ఎస్. ఎస్

రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్,కాకా శివశంకర వరప్రసాద్ పాల్వంచ (EMRS కొత్తగూడెం) బైపిసి గ్రూప్ సీట్ కేటాయించారు విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషంతో మాకు సహకరించినందుకు ఆదివాసి నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసి విద్యార్థుల సమస్యలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఉన్నత పై స్థాయి చదువులు బాగా చదవాలని ఆకాంక్షిస్తూ ప్రజా సమస్యల పోరాటంలో నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసి నాయకులు వర్స వినోద్ కుమార్, విద్యార్థిని తల్లిదండ్రులు కారం వెంకటేశ్వర్ర్లు