నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి..

-కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులకు జోన్‌-III ఇన్‌చార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశం (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 21: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జోన్‌-III ఇన్‌చార్జ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు....