Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: నమస్తే ఇందూర్
మరియాపురం గ్రామపంచాయతీ కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం నమస్తే ఇందూర్: గీసుకొండ గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామపంచాయతీ ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఎంపీడీవో ఆధ్వర్యంలో సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పిత దిలీప్ రెడ్డి, ఉప సర్పంచ్ శివ, వార్డు సభ్యులు అధికారిక ప్రమాణం చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజీ ఎంపిటిసి పోలేపాక సుమన్ గొర్రెకుంట, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు. సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పిత దిలీప్ రెడ్డి ప్రసంగంలో, “మా గ్రామం గతంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఈ గుర్తింపును తిరిగి సాధిస్తూ, మరియాపురాన్ని మరింత అభివృద్ధి చేయడం నా ప్రధాన లక్ష్యం. గ్రామంలోని సమస్యలను పరిష్కరించి, పట్టణాల స్థాయిలో అభివృద్ధి సాధిస్తాము. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మద్దతుతో గ్రామాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాను,” అన్నారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం గ్రామస్థాయి అభివృద్ధికి కొత్త దశగా భావించబడుతోంది. కొత్త పాలకవర్గం…
సర్పంచ్ ఎన్నికలపై రెడ్ అలర్ట్ గీసుగొండపై పోలీసుల నిఘా నమస్తే ఇందూర్: గీసుకొండ సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గీసుకొండ పోలీస్ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల ఆచార నియమావళి (ఎంసీసీ) అమలులో ఉన్న నేపథ్యంలో చట్ట విరుద్ధ చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసి పలు కీలక సూచనలు అనుమతి లేని ర్యాలీలు, సభలు పూర్తిగా నిషేధం , రాత్రి 10 తర్వాత ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదు ,డబ్బు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరం, ప్రభుత్వ భవనాలపై పోస్టర్లు–ఫ్లెక్సీలు పెట్టినా కేసులు, ఆయుధాలు కలిగి తిరిగినా, వాహనాల్లో తీసుకెళ్లినా కఠిన చర్య,పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ న్యూస్పై నిఘా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యతతో వ్యవహరించాలి ఎన్నికల సమయంలో అనుమానాస్పద కదలికలు, హింసాత్మక చర్యలు, విపరీత ప్రచారం గమనించిన వెంటనే…
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం.. నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 23 దేశం గర్వించదగ్గ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం.. డిసెంబర్ 2న ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని యూనివర్సిటీ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. వేదిక, స్టేజ్, శిలాఫలకం, అతిథుల వసతి,…
scdbh పుల్కల్ నందు ప్రభుత్వం నుండి వచ్చిన ఉన్ని క్యాపులను అందించిన పుల్కల్ ఎస్ ఐ వీశ్వజన్ సంగారెడ్డి జిల్లా/ఉల్కల్ మండలం/పుల్కల్ టౌన్. నమస్తే ఇందూర్/నవంబర్ 23. కె.యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్, పుల్కల్ ఎస్సీ హాస్టల్ స్టూడెంట్స్ బాగా చదివి హాస్టల్ కి పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలని 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితం సాధించాలని కోరుకున్నారు.హాస్టల్ సంక్షేమ అధికారి దస్తయ్య మాట్లాడుతు విద్యార్థుల కి మెను ప్రకారం ఆహారం అందజేస్తున్నామని తెలిపరు కార్యక్రమములో స్టేషన్ హౌస్ ఆఫీసర్ విశ్వజన్ హాస్టల్ సంక్షేమ అధికారి దస్తయ్య హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి మద్నూర్ మండల ముఖ్య నాయకులకు కార్యకర్తల సమావేశం జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, 23 నవంబర్ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ స్వగృహం జుక్కల్ బి ఆర్ ఎస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆద్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసారు ఉమ్మడి మద్నూర్ మండల నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామాల నుండి సకలంలో హాజరై సమావేశం విజయవంతం చేయండి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
హనుమకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతవిద్యాసంఘాలపై పోలీసుల దౌర్జన్యంపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహంనమస్తే ఇందూర్: హనుమకొండ, హనుమకొండ జిల్లా పరిధిలోని విద్యా రంగ సమస్యలను చర్చించేందుకు 20వ తేదీ మూడు గంటలకు వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ సీసీ “అరగంటలో కలుస్తాం” అని చెప్పినప్పటికీ, సాయంత్రం 6 గంటలు దాటినా కూడా విద్యార్థి సంఘాలను కలవకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అనవసరంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను ఈడ్చిపడేసి, కొట్టి, అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ప్రయోజనాల కోసం కలెక్టర్ పోలీసులను ఉపయోగించి వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడికి ప్రోత్సహించారని విద్యార్థి నాయకులు విమర్శించారు. విద్యార్థుల వినతిపత్రం కూడా స్వీకరించకపోవడం ప్రజాస్వామ్యంపై దెబ్బ అని పేర్కొన్నారు. “ప్రజాస్వామ్యం ఉన్న రాష్ట్రం అని…
సింగూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో నుండి అగ్నివీర్ గా ఎంపికైన సింగూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి శివ కుమార్. సంగారెడ్డి జిల్లా/ఇల్కల్ మండలం/నమస్తే ఇందూర్/నవంబర్ 19. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్. హనుమకొండలో జరిగిన ఆర్మీ ర్యాలీలో సింగూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్న శివకుమార్ అనే విద్యార్థి అగ్ని వీర్ గా ఎంపికయ్యాడు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆర్మీకి ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ ఆగమయ్య, క్రీడల్లో తీర్చిదిద్దిన PD కృష్ణ, ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేసి విద్యార్థిని అభినందించారు.69వ SGF రాష్ట్రస్థాయిలో….సత్తా చాటిన సింగూర్ గురుకులం 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్లోనూ ఓవరాల్ ఛాంపియన్ సింగూరే. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో సింగూరు గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. యాదాద్రి భువనగిరిలో జరిగిన వాలీబాల్ అండర్ 19 విభాగంలో అజయ్ కుమార్, ప్రణయ్ లు తమ ప్రతిభను కనబర్చగా జింఖానా…
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో హతం ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా దళాల భారీ ఆపరేషన్ నమస్తే ఇందూర్: అల్లూరి జిల్లా ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు పెద్ద ఎన్కౌంటర్ చేపట్టాయి. ఇందులో మావోయిస్టుల అగ్రనేత మద్వి హిడ్మా, ఆయన భార్యతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిడ్మా ఎవరు? హిడ్మా మావోయిస్టులలో అత్యంత ప్రధాన నాయకుడు. గతంలో భద్రతా దళాలపై జరిగిన పలు పెద్ద దాడుల్లో ఆయన ప్రధాన పాత్ర వహించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆయనపై ప్రభుత్వాలు భారీ రివార్డులు ప్రకటించాయి. ఎన్కౌంటర్ వివరాలు ఉదయం నక్సలైట్ల కోసం గాలిస్తున్న ప్రత్యేక దళాలపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ప్రతిగా దళాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. కొన్ని గంటలపాటు సాగిన కాల్పుల సంఘటనలో హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందగా, అక్కడి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.…
వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన అవగాహన కల్పించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 17 సోమవారం శ్రీ సత్య సాయి సమాజ సేవా ట్రస్ట్, రైటర్ బస్తీ కొత్తగూడెం లో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ, కొత్తగూడెం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ముఖ్య అతిధిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 యొక్క ప్రయోజనాలు మరియు అమలు గురించి ప్రజలకు అవగాహన కల్పించవల్సిన అవసరం ఉందని తెలిపారు.వృద్ధుల సంరక్షణ, పోషణ మరియు వారి ఆస్తుల రక్షణ కోసం ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. వృద్ధులను వారి కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా, వేధించినా, ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్లను…
సమయపాలన పాటించని అంగన్వాడి టీచర్…..! నమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 15 నవంబర్కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో గల ఎస్సీ కాలనీలో గల అంగన్వాడి కేంద్రంలో నిధులు నిర్వవలిసిన టైం మార్నింగ్ 09: నుంచి సాయంత్రం 4:00 వరకు కని అంగన్వాడి టీచర్ మాత్రం టైం కాకముందే తాళంవేసి వెళ్లిపోవడం అంగన్వాడి కేంద్రానికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు,తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తన నిర్లక్ష్యం వైఖరి వీడి సమయపాలన పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు,









