Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: Matta Sabitha
సిఎస్ఆర్ నిధుల కింద హుస్నాబాద్ మండల ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతనమైన వైద్య పరికరాలను కోటి యాభై లక్షల విలువగల పరికరాలు మంజూరు చేసిన *కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మండల బిజెప నాయకులు కృతజ్ఞతలు తెలేపారు నమస్తే ఇందూర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్టోబర్ 28 గతంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతనమైన పరికరాలను మంజూరు చేయాలని బిజెపి నాయకులు బండి సంజయ్ ని కోరగా ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు *ఒకటిన్నర కోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ఫండ్స్* ద్వారా హుస్నాబాద్ ప్రాంతం పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొని రావడం కోసం మెరుగైన వైద్య పరికరాలను మంజూరు చేశారని అన్నారు. *ఈ సి జి మిషన్, అల్ట్రాసౌండ్ మల్టీ పారామీటర్ ఆటో ఆటో క్లవీ, డయాతెరఫీ, అనస్థిష వర్క్ స్టేషన్, ఫెటల్ మానిటర్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ రికవరీ, త్రీ…
హుస్నాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది నమస్తే ఇందూర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్టోబర్ 28 హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ,వచ్చేనెల నవంబరు ఒకటో తేదీ నాడు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఇబ్రం శేఖర్ అధ్యక్షతన మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ బీసీలకు న్యాయం జరగలేదు. అదేవిధంగా బిజెపి పార్టీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు కు మద్దతిచ్చి, ముస్లింల పేరుతో బీసీల రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా, ప్రధానమంత్రి మోడీని ఒప్పించకుండా రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బిజెపి ఎంపీలు బీసీలను ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల…
ఎస్సైని సన్మానించిన రామారెడ్డి ఆటో యూనియన్ నమస్తే ఇందూర్, రామారెడ్డి అక్టోబర్ 18 రామారెడ్డి ఎస్ఐగా నియమితులైన పి రాజశేఖర్ ను రామారెడ్డి ఆటో యూనియన్ శనివారం రోజున సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ …. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు
ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు, పట్టుబడ్డ నగదు నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 19 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా లోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు. అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి కొనసాగుతున్న తనిఖీలు, లెక్కలలో లేని డబ్బులు పట్టు బడ్డ అనధికార నగదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.
బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలి సిపిఎం నాయకుడు కారు ఉపేందర్ బిజెపి కపట నాటకాలకు ప్రజలు మోసపోవద్దు నమస్తే ఇందూర్: కాజీపేట మండలం, అక్టోబర్ 17 బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో చట్టబద్ధం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న “చలో రాజ్భవన్ ముట్టడి” కార్యక్రమానికి వెళ్లకుండా జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు కారు ఉపేందర్ మాట్లాడుతూ — “అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు. బీసీలకు న్యాయం కావాలంటే 42 శాతం రిజర్వేషన్ బిల్లును చట్టంగా చేయాలి. లేకపోతే రాష్ట్ర బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలి,” అన్నారు. బిజెపి నాయకులు రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మరో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. “దేశానికి బీసీ ప్రధాని ఉన్నా, బిల్లును…
కొండగట్టులో తలనీలాల టెండర్ నమస్తే ఇందూర్ / మల్యాల అక్టోబర్17 శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, కొండగట్టు, ముత్యంపేట గ్రామం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లాతేదీ: 23-10-2025శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానము, కొండగట్టు ద్వారా భక్తుల మ్రొక్కుబడిగా సమర్పించిన తేదీ 12-04-2023 నుండి 31-07-2023 వరకు, తేదీ 01-08-2024 నుండి 28-02-2025 వరకు ప్రోగు చేసిన తలనీలాలు ఉన్నట్లు పొందుట కోసం ఈ-టెండర్, సీల్డ్ టెండర్ – బహిరంగ వేలము నిర్వహించబడును.క్రింది వివరములు:వేలం కార్యక్రమం: 23-10-2025 మధ్యాహ్నం 3:00 గంటలకు, కార్యనిర్వాహణాధికారి కార్యాలయం, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం, కొండగట్టు లో.వేలంలో నమోదయ్యే సాధారణ వివరాలు:షెడ్యూల్ కోసం దరఖాస్తు తేది: 07-10-2025 నుండి 22-10-2025 సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడును అని ఆలయ ఈవో తెలియజేశారు
పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నమస్తే ఇందూర్ జగిత్యాల జిల్లా వెలుగటూర్ ధర్మపురి మండలం అక్టోబర్ 17 జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం శాఖపూర్ పైడిపల్లి గ్రామాలలో ఇటీవలే పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైడిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంఘ కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందగా మృతుడు కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే ధర్మపురి మండల కేంద్రానికి చెందిన టోపీ రామకృషన్ ( కస్తూరి) కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా రామ్ కిషన్ ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల నాగయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి…
దేశ నిర్మాణం దిశగా యువతలో స్ఫూర్తిని నింపనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి నమస్తే ఇందూర్,హైదరాబాద్, అక్టోబరు 17: సర్దార్@150 యూనిటీ మార్చ్లో చురుకుగా పాలుపంచుకోవాల్సిందిగా యువతకు, విద్యార్థులకు, ప్రజా ప్రతినిధులకు, తెలంగాణ పౌరులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయి పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్@150 యూనిటీ మార్చ్ను మేరా యువ భారత్ (MY Bharat) పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో శుక్రవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. నిస్వార్థ సేవ, ఏకత, దేశ నిర్మాణం వంటి ఆదర్శ భావనలకు సర్దార్ పటేల్ మార్గదర్శకత్వం వహించారనీ, ఈ భావనలకు ప్రతీకగా జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల్లో యువత ముందువరుసలో నిలవాలనీ శ్రీ కిషన్…
తెలంగాణ బంద్..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్.. నమస్తే ఇందూర్ ,హైదరాబాద్: ఈనెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు._బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డిజిపి అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిజిపి సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.కాగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. అటు సుప్రీంకోర్టులో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలి బీసీల ఐక్యతను చాటుదాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్ద పోతన్న రాము పటేల్ నమస్తే ఇందూర్, డెస్క్ అక్టోబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో 42% శాతం బిసి రిజర్వేషర్లను లను రక్షించుకోవడమే ద్వేయంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన తెలంగాణ బంద్ కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్ద పోతన్న గారి రాము అన్నారు. ప్రతి ఒక బీసీలకు సంఘాలు వివిధ రాష్ట్ర రాజకీయ పార్టీలు బందు కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో…









