ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభ లో మున్సిపల్ చైర్మన్ కి వినతిపత్రం అందజేత..
కోహిర్/ఏప్రిల్02(నమస్తే ఇందూర్ ప్రీతినిధి):
సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపల్ కార్యాలయంలో kr
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘ కార్యక్రమంలో భాగంగా గ్రామసభను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘ కార్యక్రమము నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికా బద్ధమైన అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని, మున్సిపల్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ సభ సాగింది. ఈ సందర్భంగా ముందుగా కోహిర్ మున్సిపల్ చైర్మన్ కు రెండవ మాజీ వార్డ్ సభ్యులు జక్కరిగారి నగేష్ వినతి పత్రం అందజేయడం జరిగింది.రెండవ వార్డ్ సమస్యలను సైడ్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టాలని, పాడైన బోరు మరమ్మత్తులు పనులు చేపట్టాలని పలు సమస్యలను చైర్మన్ కు తెలియజేశారు.
