Friday, August 28, 2026
Homeతెలంగాణటీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నుల పంపిణీ

టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నుల పంపిణీ

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద జూలై 23:

తెలంగాణ జర్నలిస్టుల సంఘం ( టి.జె.ఏ.) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో గురువారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, స్కెచ్ పెన్నులను పంపిణీ చేశారు.కార్యక్రమానికి హాజరైన టి.జె.ఏ. నాయకులు ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేస్తూ, విద్యే జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.సామాజిక బాధ్యతలో భాగంగా 200 మంది విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, స్కెచ్ పెన్నులను అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా  టి.జె.ఏ. నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టులు కేవలం వార్తలను ప్రజలకు చేరవేయడమే కాకుండా సమాజ సేవలోనూ ముందుండాలని, విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.విద్యార్థులు తమకు విద్యా సామగ్రి అందించిన తెలంగాణ జర్నలిస్టుల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, విద్యార్థుల్లో చదువుపై మరింత ఆసక్తి పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో న్యూ ఆర్కిట్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపి సార్, వెంకట్, రిపోర్టర్లు భాను దాస్ కులకర్ణి, టేక్మాల్ దయానంద్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!