రాజంపేట ఎస్ఐగా భువనేశ్వర్ బాధ్యతల స్వీకరణ
నమస్తే ఇందూర్, కామారెడ్డి ప్రతినిధి
రాజంపేట: కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా భువనేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.రాజంపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన భువనేశ్వర్కు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


