డ్రైనేజీల వద్ద గడ్డి మందు స్ప్రే చేయించిన సర్పంచ్
దోమకొండ /నమస్తే ఇందూర్, ఆగస్టు 3:
వర్షాకాలం నేపథ్యంలో అంచనూర్ గ్రామంలోని డ్రైనేజీల వెంబడి గడ్డి అధికంగా పెరగడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గడ్డి నివారణ మందు (వీడ్ కిల్లర్) స్ప్రే చేయించారు. డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, క్రిమికీటకాల వ్యాప్తి నివారించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని గ్రామ సర్పంచ్ జనగామ నరేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందుకూరి ప్రభాకర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.


