(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
జూలై 18:
హనుమకొండ జిల్లా టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి.
(తెలంగాణ గిరిజన సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ) కార్యనిర్వాహక ఇంజనీర్ (ఈ.ఈ.)గా విధులు నిర్వహించి, ఇటీవల నిజామాబాద్–కామారెడ్డి జిల్లాల టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. కార్యనిర్వాహక ఇంజనీర్గా బదిలీపై బాధ్యతలు స్వీకరించిన రవీందర్ శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ ను కలెక్టర్ కార్యాలయంలోని ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రవీందర్ జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని తెలిపారు.కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నూతన బాధ్యతలు చేపట్టిన రవీందర్కు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

