Friday, August 28, 2026
Homeరాజకీయంకామారెడ్డిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

కామారెడ్డిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

📰 Generate e-Paper Clip

-రాహుల్ గాంధీ తీరును ఖండిస్తూ నిరసన.. రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్‌పై ఆగ్రహం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్, జూలై 23:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో గురువారం బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ కొత్త బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఉదయం 11 గంటలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించిన నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితో బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.నిరసన కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!