-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
(నమస్తే ఇందూర్) హైదరాబాద్, డెస్క్ ఆగస్టు 05:
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీని బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో భిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను నాయకులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ఓర్పుగా విన్న ఆయన, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై కూడా నాయకులతో ఆయన చర్చించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజేందర్, శశికుమార్, కొండల్ రెడ్డి, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి, రమేష్ రెడ్డి, సూర్యకాంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


