Friday, August 28, 2026
Homeఆరోగ్యంఅరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్న గిరిజన యువతికి పునర్జన్మ

అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్న గిరిజన యువతికి పునర్జన్మ

📰 Generate e-Paper Clip

-యశోద హాస్పిటల్స్‌ సోమాజిగూడ వైద్యుల విజయవంతమైన చికిత్స

(నమస్తే ఇందూర్)కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 11:

అత్యంత అరుదైన, ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతికి హైదరాబాద్‌ యశోద హాస్పిటల్స్‌ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అరుదైన త్రోంబోటిక్ త్రోంబోసిటోపెనిక్ పర్పరా ( టి.టీ.పి.) వ్యాధిని సకాలంలో గుర్తించి అత్యవసర చికిత్స అందించడం ద్వారా యువతి ఆరోగ్యాన్ని మెరుగుపరిచినట్లు వైద్యులు తెలిపారు.
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో యశోద హాస్పిటల్స్‌ వైద్యులు ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన యువతిలో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు, వ్యాధి తీవ్రత కారణంగా కీలక అవయవాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
అత్యవసరంగా ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సరోగి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు వెంటనే థెరాప్యూటిక్ (ప్లాస్మా ఎక్స్చేంజ్) చికిత్సను ప్రారంభించారు. దీనితో పాటు స్టెరాయిడ్ థెరపీ, ఇతర అవసరమైన వైద్య చికిత్సలను అందించారు. చికిత్సకు యువతి క్రమంగా స్పందించడంతో ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
యశోద హాస్పిటల్స్‌ కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ & బీఎంటీ ఫిజీషియన్ డా. జి. విద్యుత్ కుమార్ మాట్లాడుతూ, టీటీపీ చాలా అరుదైనదైనా ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. వ్యాధిని సకాలంలో గుర్తించి, ఆలస్యం చేయకుండా థెరాప్యూటిక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ వంటి చికిత్స అందిస్తే రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని వివరించారు.
కీలక అవయవాలపై ప్రభావం
టీటీపీ వ్యాధిలో రక్తంలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడి, శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ప్లేట్‌లెట్ల సంఖ్య తీవ్రంగా తగ్గడం, రక్తహీనత, బలహీనత, జ్వరం, గందరగోళం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందన్నారు. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉన్నందున సకాలంలో వైద్యులను సంప్రదించడం అత్యంత కీలకమని సూచించారు.
అత్యాధునిక వైద్య సేవలు
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ గత మూడు దశాబ్దాలుగా అత్యున్నత వైద్య సేవలను అందిస్తూ వస్తోందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని తమ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్లిష్టమైన, అరుదైన వ్యాధులకు కూడా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో వైద్యులు టీటీపీ వ్యాధి, దాని తీవ్రత, లక్షణాలు, సకాలంలో వ్యాధి నిర్ధారణ, అత్యవసర చికిత్స ప్రాముఖ్యతపై వివరించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి సకాలంలో సరైన చికిత్స అందించడం ద్వారా ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వైద్య రంగంలో విజయవంతమైన కేసుగా నిలిచిందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!