Sunday, July 19, 2026
Homeతెలంగాణఅందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు

📰 Generate e-Paper Clip

– వ్యాఖ్యాత అంబర్ మనోహర్ రావు సంతాపం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయ జులై 18:

ప్రముఖ రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు అందెశ్రీ మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని ప్రముఖ వ్యాఖ్యాత అంబర్ మనోహర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణ వార్త సాహిత్య వర్గాలను తీవ్ర విషాదంలో ముంచిందని ఆయన పేర్కొన్నారు.తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి అందెశ్రీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన రచనల ద్వారా సామాజిక సమస్యలను, సామాన్య ప్రజల కష్టనష్టాలను హృద్యంగా ఆవిష్కరించి పాఠకుల హృదయాలను తాకారని కొనియాడారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన కలంతో నిరంతరం పోరాడిన సాహితీవేత్తగా అందెశ్రీ గుర్తింపు పొందారని చెప్పారు.అందెశ్రీ కేవలం రచయిత మాత్రమే కాకుండా ఒక గొప్ప ఆలోచనాపరుడు, సమాజాన్ని చైతన్యపరిచే మేధావి అని మనోహర్ రావు అభివర్ణించారు. ఆయన రచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అందెశ్రీతో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మనోహర్ రావు, ఆయనతో గడిపిన అనేక సాహిత్య సందర్భాలు జీవితాంతం మరువలేనివని తెలిపారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సాహిత్య మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!