నూతన వస్త్ర పుష్పాలంకరణ కార్యక్రమంలో చిన్నారి చైత్రికను ఆశీర్వాదిచిన జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నమస్తే ఇందూర్ నర్సంపేట ప్రతినిధి: జులై /17
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం ఖాధర్ పేట గ్రామంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి మరియు పాత్రికేయ మిత్రులు కూస సుదర్శన్ – సరిత ల కనిష్ట పుత్రిక చైత్రిక నూతన వస్త్ర పుష్పాలంకరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య లు పాల్గొని చిన్నారి చైత్రికను సుఖసంతోషాలతో నిండు నూరేండ్లు సంతోషంగా చల్లగా ఉండాలని ఆశీర్వాదిచారు. ఈ కార్యక్రమంలో వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య, బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు మేడిద లక్ష్మణ్ లు పాల్గొన్నారు.

